సంతోష్ శోభన్, ప్రియ భవానీశంకర్ జంటగా నటిస్తున్న సినిమా ‘కళ్యాణం కమనీయం’. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. పెండ్లి నేపథ్యంగా సాగే కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న తెరపైకి రాబోతున్నది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల మాట్లాడుతూ..‘పెండ్లి నేపథ్యంగా సాగే ఆహ్లాదకర చిత్రమిది. ప్రధాన పాత్రల్లో సంతోష్ శోభన్, ప్రియా భవానీ నటన మెప్పిస్తుంది. సకుటుంబంగా చూసే చిత్రమిదని సెన్సార్ వారు అభినందించారు. క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. ఆడియోకు మంచి స్పందన వస్తున్నది. సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాం.’ అన్నారు.