తెలుగులో రాశి కంటే వాసికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నది కథానాయిక కేథరిన్. విలక్షణ కథాంశాలు, పాత్రలను మాత్రమే అంగీకరిస్తున్నదామె. త్వరలో ఆమె హీరో నితిన్తో జోడీగా నటించబోతున్నట్లు సమాచారం. నితిన్ కథానాయకుడిగా ఎం.ఎస్.రాజశేఖర్రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో ప్రధాన నాయికగా కేథరిన్ను చిత్రబృందంఎంపికచేసినట్లు సమాచారం. ఐఏఎస్ అధికారిగా ఈ సినిమాలో నితిన్ కనిపించబోతున్నట్లు తెలిసింది. అతడిని ఆరాధించే యువతిగా అభినయానికి ఆస్కారమున్న పాత్రలో కేథరిన్ నటిస్తున్నట్లు చెబుతున్నారు. కృతిశెట్టి మరో హీరోయిన్గా నటించనున్నది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం.