మేలిమి ముత్యాల్లాంటి సినిమాలను తెరకెక్కించే దర్శకులలో మణిరత్నం ఒకరు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల పోన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, జయం రవి, విక్రమ్ ప్రభు, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా కొద్ది రోజులుగా వివాదాలతో వార్తలలోకి ఎక్కుతుంది. ఆ మధ్య సినిమా షూటింగ్ సెట్ లో ఓ గుర్రం మరణించడంతో మణిరత్నంపై కేసు నమోదయ్యింది. పెటా ఇండియా మణిరత్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్ మరియు గుర్రం యజమానిపై కూడా కేసు నమోదు చేసింది. ఇక తాజాగా త్రిష, మణిరత్నాన్ని అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
శుక్రవారం త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు. హిందువులు పవిత్రంగా భావించే దేవుళ్ల విగ్రహాల మధ్య త్రిష పాదరక్షలు ధరించి రావడాన్ని హిందూ సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. త్రిష, దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదు చేయాలని హరికేష్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు