Bunny Vasu | అక్టోబర్ 16న విడుదల కాబోతున్న ‘మిత్రమండలి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రైలర్పై వచ్చిన నెగిటివ్ ట్రోల్స్ నేపథ్యంలో ఆయన భావోద్వేగంగా స్పందించారు. ఈవెంట్లో మాట్లాడిన బన్నీ వాసు, “మిత్రమండలి మంచి సినిమా. దీపావళి సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు అనువైన చిత్రమిది. పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు విజయేందర్ మంచి మనసున్న వ్యక్తి. నిర్మాతలుగా మారిన భాను, కల్యాణ్లకు శుభాకాంక్షలు అన్నారు. ఇదే క్రమంలో ఆయన ట్రోల్స్పై గట్టిగా స్పందించారు. “ఎవరైనా సినిమాను చూసిన తర్వాత కామెంట్ చేయండి.
ఎక్కడ నవ్వాలో చెప్పమని అడుగుతున్నారు. సినిమా చూసి తర్వాత కామెంట్ చేయండి. మీరు సినిమా చూసి నవ్వకపోతే, అప్పుడు కామెంట్ పెట్టండి. అక్టోబర్ 16న నాలుగు సినిమాలు వస్తున్నాయి. అన్ని బాగానే ఆడాలని కోరుకుంటున్నా. కానీ మా సినిమాను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేయడం చూస్తున్నా. డబ్బులు పెట్టి కొందరిని ట్రోలింగ్కు పెట్టారు. అలాంటి వారిని గౌరవించను. నేను తొక్కితే పడిపోయే రకం కాదు,” అని అన్నారు బన్నీ వాసు. చిన్న పిల్లల మనస్తత్వం ఇలా ట్రోల్ చేయడం. నేను పడిపోవడం అంత ఈజీ కాదు. నా వెంట్రుక కూడా పీకలేరు. నేను పడిపోవడం అంత ఈజీ కాదు. వేరే చోట నుంచి వెంట్రుక పీకి ఇవ్వగలను కానీ తలమీదనే ఎందుకు పీకుతున్నానంటే అది నా సంస్కారం. నా జర్నీలో ఎప్పుడూ పరుగెడుతూనే ఉంటా. ట్రోలింగ్ గురించి ఆలోచిస్తే అక్కడే ఆగిపోతాను.
ట్రోలింగ్ చేసేవాళ్లు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మీలోని పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్గా మార్చి తిట్టడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. ట్రోలింగ్ చేయించేవాళ్లు డబ్బులు ఇంకా ఉంచుకోండి. ఎందుకంటే సినిమా రీలీజ్ అయ్యాక మళ్లీ ట్రోలింగ్ చేయించాలి కదా. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సినిమా బాగుంటే ఆడుతుంది. లేకపోతే ఆడదు. అంతేగానీ ట్రోలింగ్ చేసి సినిమా చంపేద్దామంటే అది ఎప్పటికీ కుదరదు అంటూ బన్నీ వాసు కాస్త స్ట్రాంగ్గానే బదులిచ్చారు. ‘మిత్రమండలి’ చిత్రాన్ని బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మిస్తోంది. విజయేందర్ దర్శకత్వం వహించగా, ప్రియదర్శి మరియు నిహారిక ఎన్ఎం జంటగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.