అల్లు శిరీష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బడ్డీ’. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తున్నది. మంగళవారం ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇందులో శిరీష్ చేతిలో గన్ పట్టుకొని కనిపిస్తున్నాడు. అతని పక్కన టెడ్డీ బేర్ కనిపించడం ఆసక్తిని పంచుతున్నది. ‘వినూత్న కథాంశమిది.
అల్లు శిరీష్ పాత్ర గత చిత్రాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఆద్యంతం వినోదం, సస్పెన్స్తో ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. గాయత్రి భరద్వాజ్, గోకుల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిజ, కెమెరా: కృష్ణన్ వసంత్, రచన-దర్శకత్వం: సామ్ ఆంటోన్.