కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకడు పా రంజిత్ (Pa Ranjit). ప్రస్తుతం నక్షత్రం నగర్గిరధు (Natchathiram Nagargiradhu) సినిమా చేస్తున్నాడు. కాళిదాసు జయరాం, దుషారా విజయన్, హరి కృష్ణన్, వినోథ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పా రంజిత్ బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ముంబైలో ఆదివారం స్పెషల్ షో వేశాడు. ఈ షోకు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కాశ్యప్(Anurag Kashyap) వన్ ఆఫ్ ది గెస్ట్గా హాజరయ్యాడు.
ఈ సినిమా చూసిన అనంతరం పా రంజిత్ను హగ్ చేసుకున్నాడు కశ్యప్. సినిమా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసించాడు. బీటౌన్ స్టార్ డైరెక్టర్ నుంచి ప్రశంసలు రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోవడమే కాదు..సినిమా సక్సెస్పై ధీమాగా ఉంది చిత్రయూనిట్. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ జోనర్లో యాజి ఫిలిమ్స్, నీలమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి టెన్మా మ్యూజిక్ డైరెక్టర్.
గతేడాది పా రంజిత్ దర్శకత్వంలో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన సార్పట్టా పరంపర బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ నుంచి రాబోతున్న కొత్త సినిమా ఎలా ఉండబోతుందనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.
Dir @anuragkashyap72 hugged #PaRanjith & praised him after watching #NatchathiramNagargiradhu in Mumbai
Crew is excited by the shower of congratulatory messages.. @beemji @nanditadas @Tisaditi@ghaywan @kalidas700 @KalaiActor @officialdushara @Manojjahson @YaazhiFilms_ pic.twitter.com/Q0eeuHcmCt
— Ramesh Bala (@rameshlaus) August 29, 2022