కోటి మొక్కల రామయ్యగా ప్రసిద్ధి చెందిన పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా రూపొందిన లఘుచిత్రం ‘వనజీవి రామయ్య’. బ్రహ్మాజీ టైటిల్ రోల్ పోషించారు. పర్యావరణ సందేశంతో దర్శకుడు వేముగంటి తెరకెక్కించిన ఈ లఘుచిత్రం గద్దర్ ఫిల్మ్ అవార్డులలో బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా ఎంపికైంది. మంగళవారం ఈ లఘుచిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాష్, తన్నేరు బాబూరావు, నాగమహేశ్, నటుడు తనికెళ్లభరణి, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ కార్యక్రమానికి హాజరై చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రాన్ని దేశంలోని అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి రచన: డా.కళారంగా, కెమెరా: తోట వి.రమణ, సంగీతం: బల్లేపల్లి మోహన్, నిర్మాతలు: నిదిగొండ నరేష్కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్.