Brahma Anandam | టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మ ఆనందం’(Brahma Anandam). వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. మసూద లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి టీజర్ను పంచుకున్నారు మేకర్స్.
ఈ టీజర్ చూస్తే.. రాజా గౌతమ్, బ్రహ్మానందం తాత మనవడిగా కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. దరిద్రంను పర్స్లో పెట్టుకుని బ్రతుకుతున్న రాజా గౌతమ్కి అతడి లైఫ్లో తాతా వచ్చిన అనంతరం జరిగిన కథేంటి అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. ఫుల్ హిలేరియస్గా ఉన్న ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.