బాలీవుడ్ (Bollywood) నిర్మాత బోనీకపూర్ (Boney Kapoor) గురించి ఇవాళ ఉదయం నుంచి ఓ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (ajith kumar) హీరోగా నటిస్తోన్న వలిమై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే రజినీకాంత్, బోనీకపూర్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ వార్తలు వస్తుండటంతో దీనిపై ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు బోనీకపూర్. శివ దర్శకత్వంలో రజినీ నటించిన అన్నాత్తే సినిమానే చివరిదని అంతా అనుకునేలోపే మరో ప్రాజెక్టు ప్రకటించి..అందరిలో జోష్ నింపాడు రజినీకాంత్.
అయితే మరోవైపు నిర్మాత బోనీకపూర్, రజనీతో సినిమా చేయబోతున్నాడన్న వార్తపై క్లారిటీ ఇచ్చాడు. రజినీ నాకు చాలా ఏళ్ల నుంచి స్నేహితుడు. మేమిద్దరం తరచూ కలుస్తాం. ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకుంటాం. సినిమా కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంటే..ఆ న్యూస్ ప్రకటించే మొదటి వ్యక్తిని నేనే. మీరలాంటి లీకైన ఐడియాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. .అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్తో కొత్త సినిమా చేయనున్నాడన్న వార్తలపై బోనీకపూర్ ట్వీట్ అప్ డేట్ తో స్పష్టత ఇచ్చేశాడు.
Rajni Garu has been a friend for years. We meet regularly and keep exchanging ideas. Whenever we finalise a film to work together on, I shall be the first person to announce it. You will not have to get such ‘leaked ideas’.
— Boney Kapoor (@BoneyKapoor) February 20, 2022
రజినీకాంత్ ఇటీవలే స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar0తో భారీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.