Pallavi Joshi | బాలీవుడ్ నటి పల్లవి జోషి సినిమా సెట్లో గాయపడ్డారు. సినిమా సెట్లో ఉన్న వాహనం అదుపు తప్పి ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రత్తమైన చిత్ర బృందం ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రంలో పల్లవి జోషి నటిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతుండగా.. పల్లవి జోషి గాయపడ్డారు. పల్లవిని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత షూటింగ్ను కొనగించినట్లు చిత్ర నిర్మాత అభిషేక్ అగ్వాల్ పేర్కొన్నారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో, అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను తెరకెక్కించిన మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరి కాంబోలో మరోసారి ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత పల్లవి జోషి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.