భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో సీత పాత్రను పోషిస్తున్నది బాలీవుడ్ నాయిక కృతిసనన్. ప్రభాస్ టైటిల్ రోల్లో ఓం రౌత్ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలో జానకి పాత్రను పోషించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, అదొక జీవితకాల అనుభవమని ఆనందం వ్యక్తం చేసింది కృతిసనన్.
హృదయం నిండా భక్తిభావం, ప్రేమను నింపుకొని జానకి పాత్రలో పరిపూర్ణత కనబరిచే ప్రయత్నం చేశానని తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘ఈ కథ గురించి విన్నప్పుడు జానకి పవిత్ర హృదయం, శ్రీరాముడి పట్ల ఆమె ఆరాధనా భావం నన్ను ఎంతగానో కదిలించాయి. జానకి వంటి ఆదర్శప్రాయురాలైన మహిళ పాత్రను పోషించే విషయంలో చాలా పరిమితులుంటాయి. ఎక్కడా హద్దులు దాటకుండా గొప్ప బాధ్యతతో నా పాత్రకు న్యాయం చేశాను’ అని చెప్పింది.