Ishwarya Rai | మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్లో ‘పొన్నియన్ సెల్వన్-2’ ఒకటి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక గతేడాది సెప్టెంబర్ చివరివారంలో రిలీజైన పార్ట్-1 ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళనాట కాసుల వర్షం కురిపించింది. డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తీసుకొచ్చింది. అయితే మిగితా భాషల్లో మాత్రం బోటా బోటీ మార్కులతోనే సరిపెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సీక్వెల్పై కోలీవుడ్లో యమ క్రేజ్ ఉంది. ఈ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే బుకింగ్స్ ఓపెనవగా.. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో తెగ బిజీగా గడుపుతుంది. కాగా తాజాగా చిత్రబృందం ముంబైలో ఓ ప్రెస్మీట్ నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్లో అరుదైన ఇన్సిడెంట్ జరిగింది. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ డైరెక్టర్ మణిరత్నం కాళ్లకు నమస్కరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఐశ్వర్య సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మణిరత్నం దర్శకత్వం వహించిన ఇద్దరూ సినిమాతోనే. ఈ సినిమా ఐశ్వర్య రాయ్కు తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కూడా వీళ్ల కాంబోలో గురు, విలన్, పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాలు వచ్చాయి.
ఇలా తన మొదటి సినిమా సహా కెరీర్లో పలు మెమరబుల్ చిత్రాలను అందించిన మణిరత్నంను గురువుగా భావించే ఐశ్వర్య ప్రెస్మీట్లో మణిరత్నం కాళ్లకు నమస్కారం చేసింది. పొన్నియన్ సెల్వన్లో ఐశ్వర్య పజువూరు యువరాణి నందిని పాత్రలో నటించింది. ఇక సెకండ్ పార్ట్లో ఐశ్వర్య పాత్ర కీలకమని తెలుస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 28న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది.