తెలుగులో నాలుగు సీజన్స్ మంచి వినోదం పంచడంతో ఇప్పుడు ఐదో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఐదో సీజన్ కరోనా వలన లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 5 నుండి ఈ షోని మొదలు పెట్టనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ఐదో సీజన్ గ్రాండ్గా ప్రారంభం కానుందని నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుందని తెలియజేశారు.అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకు చెప్పిన డేట్కి బిగ్ బాస్ షో జరగడం కష్టమని పుకార్లు పుట్టించారు.
క్వారంటైన్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఇద్దరికి కరోనా వచ్చిందని, దాని వలన షో మరి కొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. తాజా సమాచారం మేరకు అవన్నీ పుకార్లేనని తెలుస్తుంది. క్వారంటైన్లో ఉన్నవారందరు చాలా ఫిట్గా ఉన్నారని, వారు బిగ్ బిస్ హౌజ్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
సీజన్ 5లో యాంకర్ రవి, సరయు సుమన్, మహా న్యూస్ లహరి, అనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ , సింగర్ కోమలి, వర్షిణి, రఘు మాస్టర్, నవ్య స్వామి, సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ దుర్గారావు పాల్గొనబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందనేది చూడాలి.