అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మోహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్నది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి చేతిలో డమరుకం పట్టుకొని శివ తాండవం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మహతి స్వరసాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మోషన్ పోస్టర్కు ప్రధానాకర్షణగా నిలిచింది. చెల్లెలి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, సంగీతం: మహతి స్వరసాగర్, సంభాషణలు: తిరుపతి మామిడాల, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మోహర్ రమేష్.