హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రాణా నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదల వాయిదా పడింది. సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు నిర్మాతల గిల్డ్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా విడుదల చేసుకున్న మార్పులను వివరించారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించారు.
శివరాత్రికి పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ చిత్రం విడుదల కానున్నది. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ నిర్మాత చినబాబు, పవన్ కల్యాణ్కు నిర్మాతల గిల్డ్ కృతజ్ఞతలు తెలిపింది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని నిర్మాత దిల్ రాజు అభిమానులకు సూచించారు. సంక్రాంతి బరిలో రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు బరిలో ఉన్నాయి. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు థియేటర్ల ఇబ్బందులు, ఇతర సమస్యలను వివరించి భీమ్లానాయక్ చిత్రం రిలీజ్ డేట్ను వాయిదా వేసేలా నిర్మాతలను ఒప్పించినట్లు తెలుస్తున్నది.