ఇపుడు ఎక్కడ చూసినా మూవీ లవర్స్ అందరి నోట వస్తున్న ఒకేఒక్క మాట భీమ్లా నాయక్ (Bheemla Nayak). పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. మరికొద్దిసేపట్లో యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ (Yousufguda police lines)లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా మొదలు కానుంది. ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని పోలీసులు అంచనా వేశారు. ముందుగా సుమారు 20 వేల మందిని ఈవెంట్కు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు పోలీసులు.
అయితే కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సభా స్థలి ప్రాంగణంలోకి కేవలం 6వేల మందికి మాత్రమే అనుమతివ్వాలని నిర్ణయించారట. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తుండటంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఈవెంట్ను నిర్వహించేందుకు పోలీసులు సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది.
ఈవెంట్ జరుగుతున్న ప్రాంగణానికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈవెంట్ వెన్యూ వద్ద పవన్ కల్యాణ్ డూప్ సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ బ్యాచ్తో డ్యాన్స్ లు చేస్తూ సందడి చేశారు.