ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్యతేజ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ అని ఉపశీర్షిక. ‘దొరసాని’ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. పీఆర్ ఫిల్మ్స్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మిస్తున్నారు. మీనాక్షీ గోస్వామి కథానాయిక. గురువారం సినిమా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
‘క్రైమ్ కామెడీ కథాంశమిది. ఈ సినిమా కథకు, భరతనాట్యానికి సంబంధం ఏమిటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి క్లాసిక్ టైటిల్ ఎందుకు పెట్టామో తెలియాలంటే టీజర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్ శాఖమూరి, సంగీతం: వివేక్ సాగర్, స్క్రీన్ప్లే, సంభాషణలు: సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర, కథ: సూర్యతేజ, దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర.