బాలీవుడ్ నాయిక భూమి పెడ్నేకర్ తదుపరి చిత్రం ‘భక్షక్’ టీజర్ గురువారం విడుదలైంది. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులను కాపాడే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పెడ్నేకర్ కనిపిస్తారు. పుల్కిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్హంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులకు సంబంధించిన ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్ వైశాలి సింగ్ అనే పరిశోధనాత్మక జర్నలిస్ట్ పాత్రను పోషించారు.
దర్శకుడు పుల్కిత్ మాట్లాడుతూ.. ‘సమాజంలోని కఠినమైన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం, అర్థవంతమైన మార్పునకు దారి తీసేలా చర్చలను ప్రేరేపించడమే మా లక్ష్యం’ అన్నారు. ఫిబ్రవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ హిందీలో తెరకెక్కిస్తున్నది. 2022లో వచ్చిన ‘డార్లింగ్స్’ చిత్రం తర్వాత రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ డిజిటల్ రంగంలోకి తిరిగి అడుగు పెట్టడానికి ‘భక్షక్’ సంకేతమని చెప్పారు చిత్ర నిర్మాత గౌరవ్ వర్మ. ‘శేజల్ సుపారి’ అనే మరో హిందీ డ్రామాలోనూ భూమి పెడ్నేకర్ నటిస్తున్నారు.