అగ్ర హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం బాలకృష్ణ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఆయన శత్రువులకు హెచ్చరిక జారీ చేస్తున్నట్లు పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘సంక్రాంతి పండగ బాలకృష్ణగారికి సెంటిమెంట్.
ఈ సీజన్లో వచ్చిన ఆయన సినిమాలు బ్లాక్బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, ‘జై బాలయ్య..’ పాటకు మంచి స్పందన లభిస్తున్నది’ అన్నారు. శృతిహాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సంగీతం: థమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.