Akhanda Sequel | బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలిస్తే ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే బాక్సాఫీస్కు పూనకం వస్తుంది. వీళ్ళ కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ ఎంత పెద్ద విజయాలు సాధించాయో తెలిసిందే. ముఖ్యంగా ‘అఖండ’ సినిమా బాలయ్య కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పైగా ఈ సినిమా రిలీజైయ్యే టైమ్లో కరోనా విళయతాండవం చేస్తుంది. కరోనా దెబ్బకు ఇండస్ట్రీ అంతా సినిమాల రిలీజ్ విషయంలో భయపడుతున్న టైమ్లో వారందరికీ ఒక ఆశను కల్పిస్తూ అఖండ చిత్రం తిరుగులేని విజయం సాధించింది. మరోసారి బాలయ్య-బోయపాటి శ్రీను కలిస్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ఈ చిత్రం నిరూపించింది.
ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమంలోనే అఖండకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి శ్రీను వెల్లడించాడు. ఇక అప్పటి నుండి అఖండ సీక్వెల్ ఎప్పుడెప్పుతు తెరకెక్కుంతుందా అని అటు ఫ్యాన్స్.. ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను అభిమానులతో పంచుకున్నాడు. అఖండ్ సీక్వెల్ను భారీ స్థాయిలో, ఫస్ట్ పార్ట్ కంటే పెద్దదిగా తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. సీక్వెల్లో కొత్త అంశాన్ని చెప్పనున్నట్లు వెల్లడించాడు. షూటింగ్ను ఎప్పుడు ప్రారంభించాలో ఇంక నిర్ణయితీసుకోలేదని పేర్కొన్నాడు. ఈ వార్తతో బాలకృష్ణ అభిమానుల్లో జోష్ నింపాడు.
ప్రస్తుతం బాలయ్య, బోయపాటి తమ తమ ప్రాజెక్ట్లలో బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ ఇటీవలే ‘వీరసింహా రెడ్డి’ షూట్ పూర్తి చేశాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. దీని తర్వాత అనీల్ రావిపూడితో యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇక బోయపాటి ప్రస్తుతం రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడని క్లారిటీ లేదు. అయితే బాలకృష్ణ 2024 ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని, బోయపాటి శ్రీనుని ఓ పొలిటికల్ కథ సిద్ధం చేయమన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ లెక్కన చూసుకుంటే అఖండ సీక్వెల్ 2024లో పట్టాలెక్కే అవకాశం ఉంది.