అమరావతి : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడురోజుల పాటు నిర్వహించుకునే ఈ పండుగల్లో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కుటుంబం రెండోరోజు సంక్రాంతిని ఉల్లాసంగా జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో నివాసముండే సోదరి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్నారు.
భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో కలిసి బాలకృష్ణ సందడి చేశారు. బాలకృష్ణ, అతడి కుమారుడు మోక్షజ్ఞ గుర్రం ఎక్కి సందడి చేశారు.