బాలకృష్ణతో జోడీగా..తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 109 వ చిత్రంలో రకుల్ప్రీత్సింగ్ను కథానాయికగా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు చోటుందని సమాచారం. రకుల్ప్రీత్సింగ్తో పాటు సంయుక్తమీనన్ను కథానాయికలుగా ఖరారు చేయబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం రకుల్ప్రీత్సింగ్ ఇండియన్-2, ఆయలాన్ చిత్రాల్లో నటిస్తున్నది.