నందమూరి బాలకృష్ణ ఇటు సినిమాలు అటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైన కూడా సత్తా చాటుతున్నారు. త్వరలో అఖండంగా గర్జించనున్న బాలయ్య .. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా లో అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో అలరిస్తున్నారు బాలయ్య . ఫస్ట్ ఎపిసోడ్లో మోహన్ బాబుతో సందడి చేసిన బాలకృష్ణ రెండో ఎపిసోడ్లో నానితో రచ్చ చేశాడు. ఆ సమయంలో బాలయ్య ఎవరికి జీవితం వడ్డించిన విస్తరి కాదు. మన ప్రయత్నానికి మనమే నారు పోసి.. నీరు పెట్టి.. కోత కోసి.. కుప్ప నూర్చి.. ఆ వరిని ఉడికించి మనమే వడ్డించుకోవాలి అపుడే జీవితం స్వర్గం అన్నారు.
అఖండ షూటింగ్ సమయంలో అయిన గాయం వలన బాలయ్య కొద్ది రోజులుగా షోకి దూరంగా ఉన్నారు. డాక్టర్లు మూడు వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో బాలయ్య ‘ఆహా’ కోసం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఇక రీసెంట్గా జరిగిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య చేతికి కట్టుతో హాజరయ్యారు. ఇప్పుడు అన్స్టాపబుల్ షోకి సంబంధించిన తాజా ప్రోమోలోను చేతి కట్టుతోనే కనిపించారు.
ఇప్పుడు అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ కు రెడీ అవుతుంది. నెక్స్ట్ గెస్ట్ ఎవరు అని అందరు ఎదురు చూస్తున్న నేపథ్యంలో నవ్వుల రాజు బ్రహ్మానందం, హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి హాజరుకానున్నట్టు ఆహా ప్రకటించింది గత కొంత కాలంగా బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిగా జాతిరత్నాలు సినిమాలో కనిపించి నవ్వించారు. త్వరలోనే పంచతంత్ర, రంగమార్తాండ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.