‘బాహుబలి’ప్రభాకర్, రఘుబాబు, ‘చిత్రం’శీను, మనోబాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పోయే ఏనుగు పోయే’. పోవనమ్మళ్ కేషవన్ నిర్మాణంలో దర్శకుడు కేఎస్ నాయక్ రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ..‘నిధి కోసం ఏనుగు బలివ్వాలని ప్రయత్నించే వేటగాడిని అతని కుమారుడు అడ్డుకుని ఏనుగును కాపాడటమే ఈ చిత్ర కథాంశం. పిల్లలకు పిల్లల మనసున్న పెద్దలకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’అన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత లత, మాస్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.