బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) నెట్ ఫ్లిక్స్ మద్దతుతో తొలి బాఫ్టా బ్రేక్ త్రూ ఇండియా పరిశోధక జ్యూరీ సభ్యుల జాబితాను ప్రకటించింది. దేశవ్యాప్తంగా చలనచిత్రాలు, గేమ్స్, టెలివిజన్ పరిశ్రమలకు సంబంధించి పలువురిని ఎంపిక చేశారు. 2021 జ్యూరీ జాబితాలో ఎఆర్ రెహమాన్ – జ్యూరీ చైర్ (మ్యూజిక్ కంపోజర్), అనుపమ్ ఖేర్ (నటుడు), చారు దేసోడ్ట్ (మాజీ బాఫ్టా బ్రేక్ త్రూ & గేమ్స్ ప్రొడ్యూసర్), కృష్ణేందు మజుందార్ (బాఫ్టా చైర్ & టీవీ నిర్మాత), మీరా నాయర్ (దర్శకుడు / రచయిత / నిర్మాత), మోనికా షెర్గిల్ (కంటెంట్- నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్), షోనాలి బోస్ (దర్శకుడు / రచయిత / నిర్మాత), సిద్ధార్థ్ రాయ్ కపూర్ (రాయ్ కపూర్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు & నిర్మాత)గా ఉన్నారు.
బ్రేక్ త్రూ ఇండియా జ్యూరీలో భాగం అయినందుకు ఏఆర్ రెహమాన్ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలో చాలా మంది క్రియేటివిటీ ఉన్నవారు తమ కళను ప్రపంచస్థాయికి తీసుకురావాలని భారతదేశం శక్తివంతమైన విభిన్న సంస్కృతిని ప్రదర్శించాలని కోరుకుంటున్నారని రెహమాన్ పేర్కొన్నారు.