ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ రైటర్లలో ఒకరు టాలీవుడ్ రచయిత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) . అక్కినేని నాగార్జున నటించిన జానకిరాముడుతో రైటర్గా ప్రయాణాన్ని ప్రారంభించి..సింహాద్రి, సమరసింహారెడ్డి, ఛత్రపతి, విక్రమార్కుడు, సై, బాహుబలి, ఆర్ఆర్ఆర్, భజరంగీ భాయ్జాన్తోపాటు ఇండస్ట్రీకి మరెన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందించారు విజయేంద్రప్రసాద్. ఈ పాపులర్ రైటర్ (Baahubali writer) కథనందించిన మరో భారీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం ఆరు భారతీయ భాషల్లో తెరకెక్కనుండటం విశేషం. ఎస్ఎస్ రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ అశ్విన్ గంగరాజు (Ashwin Gangaraju) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీకి 1770 (1770) టైటిల్ ఫైనల్ చేశారు. ప్రేక్షకులకు థ్రిల్ను కలిగించే వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ ఉండటంతోపాటు టాలెంటెడ్ యాక్టర్లు ఈ సినిమాలో సందడి చేయబోతున్నారని టాక్.
ఈ చిత్రం బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ్ రాసిన ఆనంద్మఠ్ నవల ఆధారంగా వస్తోంది . రామ్ కమల్ ముఖర్జీ ఈ కాన్సెప్ట్ను సృష్టించగా..శైలేంద్రకుమార్, సూరజ్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. విజయేంద్రప్రసాద్ను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
Next 🙂
Big Dream 🔥❤️
Pumped up to bring this Heroic Epic Tale onto the big screens 💪#1770Movie ⚔️🇮🇳Blessed to be working with #VijayendraPrasad Sir and fantastic team @Ramkamal @shhailendrakku @SurajSh25970268 @SujoyySrk @BuddyKrishna @1770Movie pic.twitter.com/OU9qHwNQf9
— Ashwin Gangaraju (@AshwinGangaraju) August 17, 2022