1940లో ఓ గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి విభిన్నమైన చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘జాతీయ రహదారి’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఒక పాటను ఇటీవల సీనియర్ దర్శకుడు బి.గోపాల్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘నరసింహ నంది పలు చిత్రాల ద్వారా అవార్డులు అందుకున్నాడు. ఈ చిత్రం కూడా అందరిని మెప్పించి తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ నెల 10న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. మధు చిట్టె, సైగల్ పాటిల్, మమత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుక్కు