గత ఏడాది నుండి ప్రపంచం తలకిందులుగా మారింది. కరోనా అనే రాకాసి రక్కసి మనందరి జీవితాలని అల్లకల్లోలం చేస్తుంది. ప్రశాంతంగా జీవిస్తున్న మనకు కంటిపై కనుకు లేకుండా చేస్తుంది. అయితే కరోనాతో గత ఏడాది నుండి చాలా మంది మృత్యువాత పడగా, మరి కొందరు ఇతర కారణాల వలన చనిపోయారు. తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ తాత సౌందరా పాండియన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు అట్లీ.
తాత ఎం సౌందరా పాడియన్ కన్నుమూశారు. పెద్ద దిక్కును కోల్పోయాం. ఇలాంటి కఠిన పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. తాత మీరు ఎల్లప్పుడు నా రోజల్ మోడల్, మా రాజు.. వు లవ్ యూ, మిస్ యూ. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అంటూ అట్లీ తన ట్వీట్లో పేర్కొన్నారు . కాగా, శంకర్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా కేరీర్ ప్రారంభించిన అట్లీ.. ఆ తర్వాత దర్శకుడిగా పరిచయమాయ్యాడు. త్వరలోనే విజయ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.