సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్ దుబాయ్ లో నిర్వహించారు. రెండో షెడ్యూల్ని హైదరాబాద్లో నిర్వహించాలని ప్లాన్ చేయగా, కరోనా ఎఫెక్ట్తో చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇప్పుడిప్పుడే అన్ని మూవీ షూటింగ్స్కి సంబంధించిన చిత్రీకరణ మొదలు కాగా, సర్కారు వారి పాట చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు.
సర్కారు వారి పాట తాజా షెడ్యూల్ ఈ నెల 15న హైదరాబాద్లో ఆరంభం కానుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబరు కల్లా పూర్తి చేయాలనే టార్గెట్ను కూడా ఫిక్స్ చేసుకున్నారట మహేశ్బాబు. ‘సర్కారువారి పాట’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు షెడ్యూలైన సంగతి తెలిసిందే. ఆ టైంకే మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు.. రాజమౌళి,అనీల్ రావిపూడి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.