‘అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగులో ఎంతమంది ఫిలింమేకర్స్ను ప్రభావితం చేసిందో అందరికీ తెలుసు. అప్పటికే సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న దర్శకులు కూడా మళ్లీ తమకు అవకాశం ఉంటే వెనక్కి వెళ్లి తమ తొలి చిత్రాన్ని ఈ సినిమా అంత పర్పెక్ట్గా తెరకెక్కించాలని కోరుకున్నారు. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా నటించిన ఈ సినిమా విజయం ఒక ట్రెండ్గా మారిపోయింది. తెలుగులోనే కాదు బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అయ్యి అక్కడా ఘన విజయం సాధించింది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమాను మాతృక దర్శకుడు సందీప్రెడ్డ్డి వంగా రూపొందించారు. టీ సిరీస్ సంస్థ నిర్మించింది. బాక్సాఫీస్ దగ్గర 379 కోట్ల రూపాయలు రాబట్టిందీ సినిమా. ఈ ఘన విజయమే ‘కబీర్ సింగ్’కు సీక్వెల్ చేసేందుకు నిర్మాతలు ఆలోచించేలా చేస్తున్నది. తాజాగా టీ సిరీస్ మురాద్ కేతాని మాట్లాడుతూ…‘కబీర్ సింగ్ది ఐకానిక్ క్యారెక్టర్. దీన్ని మరో భాగం సినిమాకూ కొనసాగించాలని చూస్తున్నాం’ అని అన్నారు. ఇందులోనూ నాయికగా కియారానే నటించనుందని సమాచారం. ‘అర్జున్ రెడ్డి’ హిందీలో రెండో భాగంగా వచ్చే అవకాశాలున్నాయి కానీ తెలుగులో ఈ విషయంపై దర్శక నిర్మాతలు స్పందించలేదు.