అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. చిన్నారి అల్లరికి సంబంధించిన ఫొటోలను బన్నీసతీమణి స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో అవి తెగ వైరల్ అవుతుంటాయి. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శాకుంతలం సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అర్హ ఈ చిత్రంలో భరతుడి పాత్రలో కనిపించనుంది. దాదాపు 20 రోజుల పాటు అర్హ ఈమూవీ షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.
అల్లు ప్రిన్సెస్కు సంబంధించిన షూటింగ్ను చిత్ర యూనిట్ ఇటీవల పూర్తి చేయగా, చిత్ర బృందం చిన్నారికి గ్రాండ్ వీడ్కోలు ఇచ్చారు. అర్హతో కేక్ కట్ చేయించి వేడుకగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్తో పాటు ఆయన సతీమణి స్నేహ కూడా హాజరయ్యారు. ఇంటికి వచ్చాక అర్హ తన తండ్రితో కలిసి సంతోషంగా గడిపింది.
ఇద్దరు కలిసి బబుల్ ఆడుకుంటూ ఉంటే.. వీడియో తీసిన అల్లు స్నేహ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక ఇప్పుడు మట్టితో స్టైలిష్ స్టార్ వారసురాలు అల్లు అర్హ కళాత్మక ఆర్ట్ చేసింది. మట్టితో తాబేలు రూపాన్ని అద్భుతంగా తీసుకొచ్చింది.ఇది నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది చూసిన నెటిజన్స్ అర్హలో ఈ టాలెంట్ కూడా దాగి ఉందా అని కామెంట్స్ పెడుతున్నారు.