AR Rahman | ‘రోజా చిత్రం నుంచి నా సంగీతంలో ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ ఎప్పటికీ మారదు. వైబ్రేషన్ కొంచెం చేంజ్ అవుతుంది. కానీ మెలోడీ, లిరిక్ ఎప్పుడూ ఒకటే’ అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన సంగీత దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నాయకుడు’. తమిళంలో రూపొందిన ‘మామన్నన్’కు తెలుగులోకి నాయకుడిగా అనువదించారు. ఉదయ్నిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తిసురేష్లు ప్రధాన పాత్రలు పోషించారు. మార్వి సెల్వరాజ్ దర్శకత్వలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ మీడియాతో ముచ్చటించారు.
‘నాయకుడు’ ఎలాంటి చిత్రం?
రాజకీయ నేపథ్యంలో రూపొందిన చిత్రం.సమాజంలోని అసమానతలు, ఇంకా ఎన్నో విషయాల గురించి చర్చించారు. ఈ కథ చాలా స్ఫూర్తివంతంగా వుంటుంది. ఇదొక టఫ్ సబ్జెక్ట్. బాగా డీల్ చేశారు. ‘నాయకుడు’లో తండ్రి, కుమారుల మధ్య అనుబంధం వుంటుంది.. రాజకీయం వుంటుంది.
ఈ చిత్రానికి సంగీత పరంగా ఎంత వరకు స్కోప్ వుంటుంది.
దర్శకుడు మారి సెల్వరాజ్ ఇంతకు ముందు తీసిన సినిమాలు పవర్ఫుల్గా వుంటాయి. గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను తీయాలనుకున్నారు. ఈ కథకు మరింత మాస్ అప్పీల్ ఇచ్చారు. ఈ తరహా చిత్రాలకు సంగీతం అందించడం కొత్త అనుభూతి. ఈ చిత్రం కోసం చాలా రోజుల తరువాత జానపద తరహాలో పాటలను కంపోజ్ చేశాను. మ్యూజిక్ రాయల్గా వుండాలనుకున్నా. ఈ చిత్రంలో ప్రతి పాటకు అర్థం వుంటుంది.
సంగీతంలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తున్నాయి? వాటిని మీరు ఎలా ఫాలో అవుతారు?
ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ ఎప్పటికీ మారదు. వైబ్రేషన్ కొంచెం చేంజ్ అవుతుంది. కానీ మెలోడీ, లిరిక్ ఎప్పుడూ సేమ్. గత నలభై ఏళ్లుగా అలాగే వుంది. ‘రోజా’ నుంచి నా ఫార్ములా మైండ్సెట్ ఒక్కటే. సాంగ్ సింపుల్, క్యాచీగా వుండాలి. బీట్, మిక్సింగ్లో మార్పు వస్తుంది. నా కోర్ కాన్సెప్ట్, మ్యూజిక్ కంపోజిషన్ సేమ్ వుంటుంది. ప్రేక్షకుల్లో, సమాజంలో మార్పులు వచ్చాయి. సంగీతంపైనా ఆ ప్రభావం వుంటుంది.
ఆస్కార్ అవార్డుకు ముందు, తరువాత రెహమాన్లో ఎటువంటి మార్పులు వచ్చాయని అడిగితే ఏం చెబుతారు?
ఎలాంటి మార్పు లేదు. అయితే ప్రపంచంలో మనకు ఇచ్చే గౌరవం పెరిగింది.
రామ్చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి మీరు సంగీతం అందిస్తున్నారని తెలిసింది?
ఇటీవలే కథ విన్నాను. చాలా మంచి కథ. ఈ చిత్రానికి సంగీతం అందించడం చాలా ఆసక్తిగా. ఆనందంగా వుంది.