ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ(ఏపీ ఎఫ్డీసీ) చైర్మన్గా ప్రముఖ పంపిణీ దారుడు పీ భరత్భూషణ్ నియమింపబడ్డారు. భరత్భూషణ్ సినీఅభిమాని. గత 20ఏండ్లుగా చలనచిత్ర పంపిణీదారుడిగా కొనసాగుతున్న ఆయన.. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రజలకు అందించి, అభిరుచిగల డిస్ట్రిబ్యూటర్గా పేరుగాంచారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆయన్ను ఎఫ్డీసీ ఛైర్మన్గా నియమించడం చర్చనీయాంశమైంది. అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ ఆయన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ, అందరినీ కలుపుకొని, సినీ, టీవీ, నాటకరంగ అభివృద్ది కోసం కృషి చేయాలని సూచించారు.