Nishaanchi | బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన తదుపరి చిత్రం ‘నిశాంఛి’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమాను వాస్తవానికి దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్తో చేయాలనుకున్నానని అనురాగ్ తెలిపారు.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘నిశాంఛి’ (Nishaanchi). అమెజాన్ MGM స్టూడియోస్ ఇండియా సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని జార్ పిక్చర్స్ బ్యానర్పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆయిశ్వర్య్ థాకరే (Aaishvary Thackeray) హీరోగా బాలీవుడ్కి పరిచయం అవుతుండగా, వేదిక పింటో(Vedika Pinto), మోనికా పన్వార్(Monika Panwar), మహమ్మద్ జీషన్ అయ్యూబ్ (Mohammed Zeeshan Ayyub), కుముద్ మిశ్రా(Kumud Mishra) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్లో పాల్గోంటున్నాడు. అయితే ఈ ప్రమోషన్స్లో భాగంగా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు అనురాగ్.
ఈ సినిమా కథను మొదట సుశాంత్ కోసం రాసుకున్నానని తెలిపాడు. 2016లో తాను ‘నిశాంఛి’ స్క్రిప్ట్ రాసుకున్నాను. ఇందులో ప్రధాన పాత్ర కోసం సుశాంత్ను సంప్రదించాను. అయితే సుశాంత్ అప్పటికే ధర్మ ప్రోడక్షన్స్లో రెండు సినిమాలను ఒకే చేశాడు. రెండు పెద్ద సినిమాలను ఒకే చేయడంతో నా కథను పక్కన పెట్టేశాడు. నా కాల్స్కి కూడా స్పందించేవాడు కాదు. దీంతో నేను ఈ ప్రాజెక్ట్ని పక్కనబెట్టి ముందుకు వెళ్లాను అంటూ అనురాగ్ చెప్పుకోచ్చాడు. సుశాంత్ మరణానికి ముందు సుశాంత్ మేనేజర్ తనను సంప్రదించాడని, కానీ తాను కోపంతో సుశాంత్తో మాట్లాడటానికి నిరాకరించానని అనురాగ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.