Dj Tillu-2 Movie | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ‘డీజే టిల్లు’ ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 12న విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ను పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను సాధించింది. సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్ధా? అనే సంధిగ్ధంలో ఉన్న టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ‘డీజే టిల్లు’ సినిమా ధైర్యాన్నిచ్చింది. ఎన్నో ఏళ్ళ నుంచి గుర్తింపు కోసం ఎదురు చేస్తున్న సిద్ధూకు ఈ చిత్రం మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ముఖ్యంగా యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తెలంగాణ యాసలో సిద్ధూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చేశాయి. దానికి తోడు నేహా శెట్టి అందాల ఆరబోత సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. కాగా ఈ సినిమా సీక్వెల్ ఇటీవలే ప్రారంభమైంది.
‘డీజే టిల్లు’లో నేహా శెట్టి పాత్రకు ఎండింగ్ పడిన విషయం తెలిసిందే. కాగా సీక్వెల్లో హీరోయిన్ కోసం మొదట శ్రీలీలను ఎంపిక చేశారు. కానీ పలు కారణాలతో శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఈమె ప్లేస్లో అనుపమను మేకర్స్ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు అనుపమ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుపమ స్థానంలో ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియస్ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే దర్శకుడు విమల్ కృష్ణ హీరోతో విభేదాలు రావడంతో తప్పుకున్నాడు. ఆయన ప్లేస్లో మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడు సీక్వెల్ను తెరకెక్కిస్తున్నాడు. పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ కథను అందించాడు. ప్రస్తుతం సిద్ధూ రెండు ప్రాజెక్ట్లకు సైన్ చేశాడు.