మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తెలుగు ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్లో సరైన ఆఫర్స్ లేవు. సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులని పలకరిస్తూ వారిని అలరిస్తూ ఉంటుంది. రీసెంట్గా వకీల్ సాబ్ మూవీపై ప్రశంసలు కురిపించి పవన్ ఫ్యాన్స్ మెప్పు పొందింది. ఇక ఇప్పుడు తన తమ్ముడితో దిగిన ఫొటో షేర్ చేసింది. ఇందులో ఇద్దరు ఒకేలా కనిపిస్తుండగా, ఈ ఫొటోని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
ఆరేళ్ల కింద మలయాళ ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ ప్రస్తుతం పొలం పనులతో బిజీగా ఉంది. రీసెంట్గా పొలంలోతపియోక దుంపలను పండించి, వాటికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్ను అలరించింది. అనుపమ.. నిఖిల్ హీరోగా నటిస్తున్న కార్తికేయ 2తో పాటు 18 పేజెస్ సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు మినహాయిస్తే అనుపమ చేతిలో మరో సినిమా లేదు.