పవన్కల్యాణ్ బయ్యా, ఝాన్వీశర్మ జంటగా నటిస్తున్న ‘అంతేనా..ఇంకేం కావాలి’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీవెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ పతాకంపై నరసింహారాజ్ దర్శకత్వంలో రవీంద్రబాబు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు మురళీమోహన్ క్లాప్నివ్వగా, దగ్గుబాటి అభిరామ్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తల్లీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో కథ సాగుతుంది. అమ్మకిచ్చిన మాటను, అమ్మాయికిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకున్నాడన్నదే కథాంశం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. చక్కటి వినోదంతో అందరిని అలరిస్తుంది’ అన్నారు. ఘర్షణ శ్రీనివాస్, సునీల్, బ్రహ్మాజీ, సుమన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఆర్.చందర్రావు, పాటలు: కాసర్ల శ్యామ్, ఆర్ట్: భూపతి యాదగిరి, దర్శకుడు: వెంకట నరసింహరాజ్.