19 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సినిమాతో నాగార్జున టాలీవుడ్ మన్మథుడిగా మారిన విషయం తెలిసిందే.ఈ సినిమా అప్పుడే కాదు ఇప్పటికి ఎంతగానో అలరిస్తుంటుంది. త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకుడు. అప్పట్లో నాగ్ కెరీర్లోనే పెద్ద హిట్ అయింది ఈ సినిమా. ఈ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు అన్షు అనే మరో భామ కూడా నటించింది.
మన్మథుడు సినిమాతో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్న అన్షు ఇలా వచ్చి అలా వెళ్లింది. మన్మథుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ రెబల్ స్టార్ ప్రభాస్ రెండో సినిమా ‘రాఘవేంద్ర’లో హీరోయిన్ గా నటించింది. అయితే.. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. చాలా కాలం తర్వాత శివాజి-లయ-భూమిక నటించిన ‘మిస్సమ్మ’లో అతిథిపాత్రలో మెరిసిందీ అమ్మడు. అదే తన చివరి చిత్రం.
మన్మథుడు, రాఘవేంద్ర సినిమాలలో చనిపోయే పాత్రలు చేసిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలోను కొన్ని సినిమాలు చేసిన అన్షు ఆ తర్వాత లండన్కి వెళ్లింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లండన్ లో సెటిల్ అవగా.. అక్కడే ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తుందట. అక్కడ ఆమెకు ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాపు కూడా రన్ చేస్తుంది. లండన్ కు చెందిన సచిన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిన అన్షుకి పాప, బాబు ఉన్నారు. ఇప్పుడు అన్షు ఫ్యామిలీ ఫొటోలు వైరల్ గా మారాయి.