Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ గుంటూరు కారం (Guntur kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ మూవీ నుంచి పూజాహెగ్డేతోపాటు డీవోపీ పీఎస్ వినోద్ పక్కకు తప్పుకున్నారని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు మరో గాసిప్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
గుంటూరు కారం నుంచి ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ తప్పుకున్నారని తాజా టాక్ నడుస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. మరి ఈ ఇది కేవలం పుకారు మాత్రమేనా..? లేదంటే నిజమేనా..? అనే దానిపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ మహేశ్ బాబు అభిమానులకు కావాల్సిన పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తూ సాగుతోంది.
గుంటూరు కారం నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే షురూ కానుండగా.. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్లో రెండు భారీ సెట్స్ వేసినట్టు ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి. ఏఎస్ ప్రకాశ్ నేతృత్వంలో ఈ సెట్స్ నిర్మాణం కోసం భారీ మొత్తాన్ని వెచ్చించినట్టు ఇన్సైడ్ టాక్. ఈ సెట్స్లో ఒకటి మహేశ్ బాబు తాతయ్యకు సంబంధించిన పాత్ర కోసం కాగా.. రెండో సెట్ హైదరాబాద్లో హీరో తల్లి ఇల్లు అని టాక్ నడుస్తోంది.
గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గుంటూరు కారం 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..