సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి హిట్ వచ్చి చాలా కాలం అయింది. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తెపై చాలా హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. రజనీకాంత్ అనారోగ్య సమస్యలతో పాటు కరోనా కూడా అన్నాత్తె షూటింగ్కి అడ్డుకట్ట వేసింది. అయితే ఎట్టకేలకు చిత్ర షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకురాబోతున్నారు
చివరిగా ‘దర్బార్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రజనీకాంత్ ఇప్పుడు అన్నాత్తె అంటూ రాబోతున్నారు. సన్ పిక్చర్స్’ బ్యానర్పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. విశ్వాసం, వివేకం తదితర సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివకుమార్ జయకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
రజనీకాంత్ ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుండగా, మిగతా పార్ట్ని వచ్చే నెలాఖరు వరకూ పూర్తి చేసే అవకాశం ఉంది. దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.ఈ చిత్రంలో రజనీకాంత్ ఓ ఊరి పెద్ద పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్లుగా మీనా, కుష్బూ, నయనతార నటిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుంది. జాకీ షాఫ్ర్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వేల రామ్మూర్తి తదితరులు ప్రధాన తారగణంగా ఉండనున్నారు. డి.ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు