తెలుగు సినీరంగంలో వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నారు అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో బ్లాక్బస్టర్ హిట్స్ని అందించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వెంకటేష్-కల్యాణ్రామ్లతో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా అనిల్ రావిపూడి లైనప్లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతున్నది. భారతీయ పురాణేతిహాసం రామాయణ గాథను యానిమేటేడ్ వెర్షన్లో తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తున్నది.
ఈ ప్రాజెక్ట్ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నారని ఫిల్మ్నగర్ టాక్. 2024లో వచ్చిన ‘మహావతార్ నరసింహా’ యానిమేషన్ ఫిల్మ్కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో రామాయణ ఆధారంగా ఓ యానిమేటెడ్ ఫిల్మ్కు కేవీఎన్ ప్రొడక్షన్ శ్రీకారం చుట్టిందని తెలిసింది. భారీ బడ్జెట్తో ఆధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, త్వరలో అధికారిక ప్రకటన
ఉంటుందని సమాచారం.