Animal Movie | బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా.. సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఆడియెన్స్ ఏ రేంజ్లో అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైగా ఈ సినిమాలో రణబీర్ కపూర్ వైలెంట్ మోడ్లో కనిపిస్తుండటంతో జనాల్లో కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఇక హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను డిసెంబర్ 1న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు.
ఇప్పటికే ముంబయిలో చేసిన ప్రమోషన్స్కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో తెలుగులోనూ అదే స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. దానికోసం హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీని ఎంచుకున్నారు. నవంబర్ 27 తేదిన ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. అయితే ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇక ఈ విషయాన్ని చిత్రబృందమే స్వయంగా వెల్లడించడం విశేషం.
Join the adventure and feel the thrills at the #Animal Grand Pre-Release Event, TODAY from 5⃣ PM 💥
Super 🌟 @urstrulyMahesh Garu & Legendary Director @ssrajamouli garu gracing as Chief Guests 🔥
📍 Malla Reddy University, HYD #AnimalOn1stDec #AnimalTheFilm @AnimalTheFilm… pic.twitter.com/y7Twv1l7du
— Ramesh Bala (@rameshlaus) November 27, 2023
మరోవైపు రాజమౌళి- మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మూవీకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.