పుణె: ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో శతక్కొట్టాడు. తొలి వన్డేలో సెంచరీకి కొద్ది దూరంలో (94 పరుగులు) ఆగిపోయిన బెయిర్ స్టో… రెండో వన్డేలో ఆ ఫీట్ను అందుకున్నాడు. కుల్దీప్ వేసిన 30వ ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్గా బాదిన బెయిర్ స్టో 95 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో సెంచరీని అందుకున్నాడు. మరోవైపు బెన్ స్టోక్స్ (38 బంతుల్లో 49 బ్యాటింగ్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా అర్ధశతకానికి చేరువయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్కు అజేయంగా 101 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ 211/1తో డ్రింక్స్ విరామానికెళ్లింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి