దర్శకుడు అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వరప్రసాద్గారు’ చిత్రాలతో వరుసగా రెండు సంక్రాంతి సీజన్లలో బ్లాక్బస్టర్స్ హిట్స్ కొట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అక్కినేని అఖిల్తో ఆయన సినిమా చేయబోతున్నారని సోషల్మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్తోనే తన తదుపరి చిత్రాన్ని చేయడానికి అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారని తెలిసింది.
అయితే ఇది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్ కాదని అంటున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ను ఇప్పట్లో పట్టాలెక్కించే ఆలోచన లేదని అనిల్ రావిపూడి ఇటీవలే మీడియా సమావేశంలో తెలిపారు. ఈసారి సరికొత్త కథతో ఆయన ముందుకురాబోతున్నారని అంటున్నారు. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ వంటి హిట్ చిత్రాలు రావడంతో ఈ ఐదో సినిమా గురించి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించి 2027 సంక్రాంతి బరిలో దించాలన్నది మేకర్స్ ప్లాన్గా చెబుతున్నారు. సాహు గారపాటి-సురేష్బాబు నిర్మిస్తారని సమాచారం.