నవదీప్, పంఖురి గిద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మౌళి’. అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలోని ‘అందాలు చదివే కళ్లకైనా’ అనే గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు.
గోవింద్ వసంత స్వరపరచిన ఈ పాటను అనంత్శ్రీరామ్ రచించారు. అనిల్ కృష్ణన్ ఆలపించారు. చక్కటి మెలోడీగా ఈ పాట సాగింది. వినూత్న ప్రేమకథాంశమిదని దర్శకుడు పేర్కొన్నారు. మేఘాలయాలోని చిరపుంజీలో ఈ సినిమాను చిత్రీకరించామని నిర్మాత తెలిపారు.