అల్లరి నరేష్(Allari Naresh) లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (Itlu Maredumilli Prajaneekam). ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆనంది హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ నవంబర్ 25న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విశ్వక్ సేన్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లరి నరేష్.. సినిమాలో తనను బాగా చూపించిన డిఓపి రామ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. శ్రీచరణ్ పాకాల అందించిన అద్భుతమైన బీట్స్కు డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. జీ స్టూడియోస్ మా సినిమాకు అద్భుతమైన సహకారం అందించింది. ఈ సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా పరిచయమవుతున్న రాజేష్ దండా, ఏఆర్ మోహన్లకు ఆల్ ది బెస్ట్. మాకు మద్దతుగా నిలిచిన టీం మొత్తానికి ధన్యవాదాలు.ఈ సినిమా మొత్తం సీరియస్గా ఉండకుండా, వినోదం కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్.
శ్రీ తేజ్ పెద్ద నటుడవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు అల్లరి నరేష్. ఆనంది సినిమా కోసం చాలా కష్టపడిందని, ఆమె తన కళ్లతో నటిస్తుందని చెప్పాడు. ఈ మూవీ పాన్ ఇండియన్ ఫిల్మ్ అయ్యే అవకాశం ఉందని, భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు నరేష్.
ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నాడు.
Clicks from #ItluMaredumilliPrajaneekam Pre Release Event! 📸✨
A Lovely evening with only positive vibes & heartfelt words about the progress of the movie! 💖#IMP #IMPonNov25th ✅@allarinaresh @anandhiactress @dir_armohan @SricharanPakala @ZeeStudios_ pic.twitter.com/OewB3a8Qu2
— Hasya Movies (@HasyaMovies) November 21, 2022