శ్వేతసుందరి అమీజాక్సన్ తనకు కాబోయే భర్తతో బ్రేకప్ చేసుకుందా? గత ఏడాది పెళ్లి సన్నాహాలు చేసిన ఈ జంట తమ బంధానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పుకొన్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లాండ్ నుంచి దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టి అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది అమీజాక్సన్. ‘మద్రాసుపట్నం’ ‘ఐ’ ‘ఎవడు’ ‘రోబో-2’ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది. గత కొన్నేళ్లుగా ఈ అమ్మడు బ్రిటీష్ యువ వ్యాపారవేత్త జార్జ్ పనాయిటోతో ప్రేమలో ఉంది. రెండేళ్ల క్రితం అమీజాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకముందే తల్లి అయినప్పటికి తన బాబు, కాబోయే భర్తతో తీయించుకున్న ఫొటోలను సోషల్మీడియాలో క్రమం తప్పకుండా షేర్ చేసేది. ఈ జంట గత ఏడాది గ్రీస్లో వైభవంగా పెళ్లికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా వారి ప్రయత్నాలు ఆగిపోయాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరిద్దరు విడిపోయారని తెలుస్తోంది. అందుకు బలం చేకూర్చుతూ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జార్జ్ పనాయిటోతో కలిసి ఉన్న ఫొటోలను మొత్తం తీసివేసింది అమీజాక్సన్. దీంతో ఈ జంట బ్రేకప్ చెప్పుకొన్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. 2019లో ఈ జోడీకి నిశ్చితార్థం జరిగింది. వివాహ ప్రయత్నాల్లో ఉండగానే ఈ జంట ఎందుకు బ్రేకప్కు సిద్ధపడ్డారనేది అంతుపట్టడం లేదని అభిమానులు అనుకుంటున్నారు.