Amitabh Bachchan | ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకులకు గొప్ప అనుభూతినందిస్తుందని అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. ఈ సినిమా గురించి తన తాజా బ్లాగ్లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అమితాబ్. “కల్కి’ షూటింగ్లో పాల్గొంటున్నా. ఇంటికి వచ్చేసరికి రాత్రి చాలా అలస్యమైంది.
చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. ప్రేక్షకులకు గొప్ప అనుభూతినందించే చిత్రమవుతుందని నమ్మకం ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం మే 9న సినిమా విడుదలవుతుంది’ అని అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు. అమితాబ్ మాటలతో ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. మహాభారత కాలంలో మొదలై 2898 వరకు జరిగే కథతో దర్శకుడు నాగ్అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశాపటానీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలేర్పడ్డాయి.