ముంబై : అనారోగ్యం, ఇతర పనుల ఒత్తిడితోనే అమెరికాలో జరిగిన కల్కి (Kalki) ఈవెంట్కు హాజరు కాలేదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కేగా సెట్స్పై ఉన్న గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైఫై ఫిల్మ్ ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ లాంఛ్ ఈవెంట్ శుక్రవారం అమెరికాలోని కామిక్ కాన్ వేదికగా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి ప్రభాస్, కమల్ హాసన్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ అధినేత, నిర్మాత అశ్వనీ దత్ హాజరయ్యారు. అమితాబ్ ఈ ఈవెంట్లో వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈవెంట్కు తాను ఎందుకు హాజరుకాలేకపోయాననే వివరాలను అమితాబ్ తన పర్సనల్ బ్లాగ్లో వెల్లడించారు.
శాండియాగో, కే, ది ప్రాజెక్ట్..ఈ సినిమా ఫస్ట్లుక్ లాంఛ్కు హాజరైన మేకర్లకు, మూవీ టీంకు అద్భుత క్షణాలివి…ఈ ప్రోగ్రాంకు రావాలని నాగ్ ప్రోత్సహించినా పనుల ఒత్తిడి, వైద్యపరమైన నియంత్రణలతో దూరంగా ఉండాల్సి వచ్చిందని అమితాబ్ రాసుకొచ్చారు. అయితే ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది..స్టైల్, మ్యూజిక్ సహా ప్రతి ఒక్కటీ అద్భుతం…కల్కి…2898 ఏడీ !! అని అమితాబ్ పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్లో ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా అమితాబ్ గాయపడ్డారు.2024, జనవరి 12న కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Read More :