Shivani Nagaram | ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది శివానీ నాగరం. చక్కటి గ్రామీణ కథ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పిందీ భామ. సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా శివానీ నాగరం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్కు వెళ్లే కథానాయికగా సెలెక్ట్ చేయడం ఆనందంగా అనిపించింది.
ఈ సినిమా కోసం నెల రోజుల పాటు ప్రిపేర్ అయ్యాను. ప్రతి డైలాగ్ను గుర్తుపెట్టుకున్నా. దాంతో షూటింగ్లో కష్టమనిపించలేదు. ఈ సినిమాలో నేను లక్ష్మి అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నాకు కూచిపూడి డ్యాన్స్లో మంచి అనుభవం ఉంది. పిల్లలకు సంగీతం నేర్పిస్తుంటా. దాంతో డ్యాన్స్ విషయంలో అంత కష్టంగా అనిపించలేదు. హీరోయిన్గానే కాదు.. కథలో కీలకంగా ఉండే పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. ప్రతిభ కలిగిన తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. తెలుగమ్మాయిలు హీరోయిన్స్గా నటిస్తే భాష విషయంలో ఎన్నో అడ్వాంటేజేస్ ఉంటాయి’ అని చెప్పింది.